CBSE Board Exams 2024-2025: కేంద్రం కీలక నిర్ణయం, ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు పరీక్షలు
సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు (CBSE Board Exams 2024-2025) ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు జరగనున్నాయి. అయితే పరీక్షలు రెండుసార్లు రాయాలా? వద్దా? అనేది విద్యార్థుల ఇష్టంపై ఆధారపడి ఉంటుంది.
సీబీఎస్ఈ బోర్డు ఎగ్జామ్స్ 2024-2025 (CBSE Board Exams 2024-2025): సీబీఎస్ఈ పదో తరగతి, ఇంటర్ పరీక్ష విధానంలో మార్పు జరిగింది. పరీక్షల (CBSE Board Exams 2024-2025) నిర్వహణ విషయంలో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (Central Board Of Secondary Education) కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం వచ్చే విద్యా సంవత్సరం అంటే 2024 -24 నుంచి ఏడాదిలో రెండుసార్లు బోర్డు పరీక్షలను నిర్వహించనుంది. అయితే ఈ పరీక్షలను రెండుసార్లు రాయాలా? లేదా? ఒకేసారి రాయాలా? అనేది విద్యార్థుల ఇష్టమని బోర్డు తెలియజేసింది. అంతే పరీక్షలను రెండుసార్లు రాయాలనే నిర్బంధమేమి లేదని వెల్లడించింది. అదే సమయంలో ఒకవేళ రెండు సార్లు పరీక్షలు రాస్తే.. ఎందులో ఎక్కువ మార్కులు వస్తే.. ఆ మార్కులనే పరిగణనలోకి తీసుకుంటామని తెలియజేసింది.
అయితే విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు పరీక్షా విధానంలో మార్పులు చేసినట్టు కేంద్ర విద్యాశాఖ తెలియజేసింది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే పరీక్షలు రాసే అవకాశం ఉండడంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. అంతేకాకుండా ఏడాదికి రెండుసార్లు పరీక్షలు రాయడం వల్ల విద్యార్థులు పూర్తిస్థాయిలో సిలబస్ ప్రిపేర్ అయ్యే ఛాన్స్ ఉంటుందని, వారి స్కోర్ కూడా పెరుగుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు. అలాగే అదే మొదటిసారి పరీక్షల్లో మంచి మార్కులు వస్తే రెండోసారి రాయక్కర్లేదు కూడా. దీనివల్ల ఏడాది మొత్తం విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి కూడా ఉండదని అధికారులు అంటున్నారు.
కాగా 2025 బోర్డుల మొదటి సెట్ పరీక్షలు నవంబర్-డిసెంబర్ 2024లో జరిగే అవకాశం ఉంది. రెండోది ఫిబ్రవరి-మార్చి 2025లో జరుగుతుంది. ఫైనల్ ఫలితాలు, మెరిట్ జాబితా ఆధారంగా ఉంటుంది రెండు పరీక్షల నుంచి అత్యుత్తమ స్కోర్లుపై ఆధారపడి ఉంటాయి. ఇక 2023లో CBSE బోర్డు పదో తరగతి పరీక్షలకు మొత్తం 38.82 లక్షల మంది అభ్యర్థులు, ఇంటర్ పరీక్షలకు 16.96 లక్షలు మంది హాజరయ్యారు.
ఈ నిర్ణయంతో పాటు కేంద్రం మరో నిర్ణయం కూడా తీసుకుంది. జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనడానికి వెళ్లి పరీక్షలు రాయలేని సీబీఎస్ఈ (CBSE) 10, 12 తరగతుల విద్యార్థుల కోసం సీబీఎస్ఈ బోర్డు ప్రత్యేకంగా పరీక్షలను నిర్వహించాలని కూడా కేంద్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మార్పులను విద్యార్థులు గమనించాలి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని పొందండి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.