77th Independence Day 2023: భారత స్వాతంత్ర పోరాటంలో "చదువు" పాత్ర
భారతదేశం 2023, 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని (77th Independence Day 2023) జరుపుకోవడానికి సిద్ధమైనందున, విద్యార్థులు విద్య, దాని ప్రభావం ఇటీవలి మార్పులతో పాటు భారత స్వాతంత్ర పోరాటంలో దాని పాత్ర గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు.
ఎందరో ప్రాణ త్యాగాలతో సాగిన భారత స్వాతంత్య్ర సంగ్రామంలో విద్య (Education) ముఖ్యపాత్ర పోషించింది. భారత దేశ స్వాతంత్రం కోసం ముందు నిలబడిన యువకులందరిపై విద్య ప్రభావం చాలానే ఉంది. వారంతా విద్యార్థి దశలోనే బ్రిటిష్ వారిని ఆకృత్యాలు గురించి, దేశ పరిస్థితి గురించి తెలుసుకున్నారు.
వ్యాపారం పేరుతో 18వ శతాబ్దపు మధ్యకాలంలో బ్రిటీషర్లు భారతదేశంలోకి ప్రవేశించారు. అయితే అప్పుడు భారతదేశం తన హక్కుల కోసం పోరాడటానికి తగినంతగా సిద్ధంగా లేదు. అప్పట్లో ప్రజలందరికీ విద్య అందుబాటులో లేదు. విద్యాలయాలు, కళాశాలలు ఉన్న కొందరికే పరిమితం అయ్యాయి. అయితే బ్రిటిష్ వారు తమ వ్యాపార అభివృద్ధికి దోహదం చేస్తుందనే ఉద్దేశంతో మన దేశంలో విద్యాలయాలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం విద్యా విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు.
ఆ విద్యావిధానం దేశంలోని యువతీ, యువకులకు విజ్ఞానాన్ని పెంపొందించడంలో బాగా సహాయపడింది. భారత స్వాతంత్ర పోరాటానికి పునాది వేయడానికి దోహదపడింది.
ఇంగ్లీష్లో మాట్లాడటం, చదవడం, రాయడం ప్రారంభించిన తర్వాత బ్రిటిష్ ప్రజలకు వారి డిమాండ్ల గురించి తెలుసుకోవడం భారతీయులకు సులభమైంది. అంతేకాదు బ్రిటీష్ చట్టాలను, వాటి ప్రభావాలను గ్రహించారు. అర్థం చేసుకున్నారు. అలాగే బ్రిటీష్ కౌన్సిల్ సిఫార్సు చేసిన పాఠ్యాంశాలు ప్రజాస్వామ్యం, లౌకికవాదం, కమ్యూనిజం, ఇతర సంబంధిత అంశాలకు సంబంధించినవి. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల ద్వారా ఈ భావనలు సమాజాన్ని ప్రేరేపించాయి.
ఎడ్యుకేషన్ బ్రిటిష్ వారిని ఆత్మవిశ్వాసంతో ప్రశ్నించేలా ప్రోత్సహించి వారి స్వాతంత్రానికి మార్గం సుగమం చేసింది. నాయకులు 'బ్రిటీష్ పాలన ఆర్థిక ప్రభావం'పై దృష్టి సారించారు. బ్రిటీష్ వారు పన్నుల ద్వారా భారతదేశ సంపదను కొల్లగొడుతున్నారని తెలుసుకున్నారు. ఇవి విద్య ద్వారా సాధ్యం అయింది. ముఖ్యంగా అందరికి ఇంగ్లీష్ రావడంతో ఇతర దేశాల పుస్తకాలను మన భారతీయులు విస్తృతంగా చదివారు. భగత్ సింగ్ లాంటి నాయకులు ఉరి వేయబడడానికి రెండు నిమిషాల ముందు కూడా పుస్తకాలు చదువినట్టు చరిత్ర చెబుతుంది. ఇతర దేశాల సాహిత్యం ద్వారా బ్రిటిష్ వారి దురాగతాలపై అవగాహన పెంచుకున్నారు. బ్రిటిష్ పాలనలో జరిగిన దోపిడి గురించి, వారి అణచివేత గురించి విస్తృతంగా రాశారు. దాంతో అన్ని వర్గాల ప్రజలు ప్రశ్నించడం మొదలుపెట్టారు. దాంతో స్వాతంత్రం పోరాటం మరింత ఊపందుకుంది. ఆ సంగ్రామంలో ఎంతోమంది యువతీ, యువకులు భాగమయ్యారు. అలా బ్రిటిష్ బానిస సంకెళ్లను తెంచుకోవడంలో విద్య ప్రముఖమైన పాత్ర వహించింది.
అందుకే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి భారతదేశం యువతకు విద్యను అందించడానికి, వృద్ధులను వారి పిల్లలను పాఠశాలలు, కళాశాలలకు పంపేలా ప్రేరేపించడానికి అవిశ్రాంతంగా కృషి చేసింది. భారతదేశం భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21A కింద 'విద్యా హక్కు'ని కూడా చేర్చింది. ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలకు 'ఉచిత, నిర్బంధ విద్య' చేర్చడం జరిగింది. కాబట్టి దేశంలోని తరువాతి తరం విద్య సహాయంతో ఎదగడానికి, ప్రపంచంలోని అగ్ర దేశాలలో ఒకటిగా దేశాన్ని తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉండాలి.
ఇది కూడా చదవండి| ఆగస్టు 2023లో పాఠశాలలకు సెలవులు
మరిన్ని విషయాల కోసం కాలేజ్ దేఖో కోసం చూస్తూ ఉండండి Education News ఎంట్రన్స్కి సంబంధించినది పరీక్షలు, బోర్డులు మరియు అడ్మిషన్ . మీరు మా ఇ-మెయిల్ ID news@collegedekho.com వద్ద కూడా మాకు వ్రాయవచ్చు.