R 18 రెగ్యులేషన్ విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇచ్చిన JNTU హైదరాబాద్
R 18 రెగ్యులేషన్ విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇచ్చిన JNTU హైదరాబాద్ , విద్యార్థులకు 30 గ్రేస్ మార్కులు కలుపుతున్నట్లు ఉత్తర్వులు జారీ చేసిన యూనివర్సిటీ అధికారులు.
విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలపనున్న JNTU హైదరాబాద్ : జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యునివర్సిటీ హైదరాబద్ 2022-23 అకడమిక్ ఇయర్ లో ఇంజనీరింగ్ కోర్సు తీసుకున్న అభ్యర్థులకు గ్రేస్ మార్కులు కలుపుతున్నట్టు ప్రకటించింది. ఇంజనీరింగ్ ఫైనల్ సెమిస్టర్ లో ఫెయిల్ అయిన అభ్యర్థులకు 30 గ్రేస్ మార్కులను కలుపుతున్నట్లు గా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే డిప్లొమా పూర్తి చేసిన ఇంజనీరింగ్ అభ్యర్థులకు 23 గ్రేస్ మార్కులను కలిపారు.
గతంలో కరోనా సమయంలో ఇంజనీరింగ్ మరియు మెడికల్ విద్యార్థులకు గ్రేస్ మార్కులు పెంచగా ఇప్పుడు కూడా అన్ని విభాగాల విద్యార్థులకు సంబంధిత డిపార్ట్మెంట్ డీన్ నిర్ణయం ప్రకటించారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమలులోకి వచ్చాయి. విద్యార్థుల కు ఈ గ్రేస్ మార్కులను కలపడం వలన 4వేల మంది కి ప్రయోజనం కలుగుతుంది. R18 రెగ్యులేషన్ విద్యార్థులకు ఈ గ్రేస్ మార్కులు వర్తిస్తాయి.
జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యునివర్సిటీ అధికారులు 16 డిసెంబర్ 2023 తేదీన సంబంధిత ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమలులోకి వస్తాయి అని కూడా అధికారులు వెల్లడించారు. దీంతో చాలా మంది విద్యార్థులు ఇంజనీరింగ్ మరియు మెడికల్ విభాగాలలో అర్హత సాధించానున్నారు.