School Assembly News Headlines for 15 July 2023: ఏపీ, తెలంగాణ, జాతీయ వార్తలు ఇక్కడ తెలుసుకోండి
జూలై 15 స్కూల్ అసెంబ్లీ కోసం ఏపీ, తెలంగాణ, జాతీయ వార్తలను (School Assembly News Headlines for 15 July 2023) ఇక్కడ ఇచ్చాం. తాజా అప్డేట్లను ఇక్కడ తెలుసుకోండి.
స్కూల్ అసెంబ్లీ వార్తల కోసం ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలను (School Assembly News Headlines for 15 July 2023) ఇక్కడ అందజేశాం.
15 జూలై 2023 కోసం స్కూల్ అసెంబ్లీ వార్తల ముఖ్యాంశాలు (School Assembly News Headlines for 15 Juay 2023)
ఆంధ్రప్రదేశ్ వార్తలు (Andhra Pradesh News)
- చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైంది. మధ్యాహ్నం 2:35 గంటలకు నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం-3 ఎం 4 రాకెట్ జాబిల్లి దిశగా ప్రయాణించే కక్ష్యలోకి చేరింది.
- మంగళగిరిలో నిర్వహించిన మహాశక్తి ప్రచార కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాట్లాడారు. ఈ సందర్భంగా డ్వాక్రా సంఘాలు తీసుకొచ్చి మహిళల పొదుపుశక్తిని పెంచామని చంద్రబాబునాయుడు అన్నారు.
- సీబీఐ కోర్టులో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ జరిగింది. ఈ సందర్భంగా నిందితులు కోర్టు విచారణకు హాజరయ్యారు.
- సీఎం జగన్ అబద్ధాల కోరని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. మరో 160 రోజుల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సీఎం అవుతారని చెప్పారు.
తెలంగాణ వార్తలు (Telangana News)
- రంగారెడ్డి జిల్లా చందనవెల్లిలో ఏర్పాటు చేయనున్న జపనీస్ సంస్థ Daifuku కొత్త ఫ్యాక్టరీకి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. హిరోషిమా, నాగసాకి విధ్వంసం నుంచి జపాన్ తేరుకున్న విధానం ప్రశంసనీయమని ఆయన అన్నారు.
- పీసీసీ నేత రేవంత్రెడ్డి అనుచరులు తనకు బెదిరింపు కాల్స్ చేశారని బీఆర్ఎస్ నేత శ్రవణ్ ఆరోపించారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
- బీఆర్ఎస్లోకి వెళ్తున్నానంటూ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. తనపై విధించిన సస్పెన్షన్ను బీజేపీ రద్దు చేయకపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నారు.
- వరంగల్ రైల్వేస్టేషన్లో వాటర్ ట్యాంక్ కూలిన ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. ఫ్లాట్ఫామ్ నెంబర్ వన్ వద్ద రైలు కోసం వేచి ఉన్న ప్రయాణికులు గాయపడ్డారు.
జాతీయ వార్తలు (National News)
- ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ ఆనర్ను అందుకున్నారు.
- కొన్ని చైనీస్ ఉక్కు ఉత్పత్తులపై సబ్సిడీ వ్యతిరేక పన్నుల పిలుపును భారత్ తిరస్కరించింది.
- జమ్మూ బేస్ క్యాంపు నుంచి 7,000 మంది యాత్రికులు అమర్నాథ్ యాత్రకు బయలుదేరారు.
- అరుణాచల్ ప్రదేశ్ను భారతదేశంలో ఒక ప్రాథమిక అంశంగా గుర్తిస్తూ చేసిన తీర్మానాన్ని U.S. సెనేట్ కమిటీ ఆమోదించింది.
- మణిపూర్లో ఇంటర్నెట్ పరిమిత పునరుద్ధరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను జూలై 17న విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
- మణిపూర్ గవర్నర్ ఉయికే ఇంఫాల్ సహాయ శిబిరాన్ని సందర్శించారు. ఖైదీలకు అన్ని రకాల సహాయాన్ని అందిస్తామని వాగ్దానం చేశారు.