School Assembly News Headlines for 18 July 2023: ఏపీ, తెలంగాణ, జాతీయ వార్తలు ఇక్కడ తెలుసుకోండి
వివిధ రంగాలకు సంబంధించిన పాఠశాల అసెంబ్లీ కోసం విద్యార్థులు 18 జూలై 2023కి సంబంధించిన తాజా వార్తల అప్డేట్లను (School Assembly News Headlines for 18 July 2023) ఇక్కడ తెలుసుకోవచ్చు.
న్యూస్ రీడింగ్ కోసం సిద్ధమవుతున్న విద్యార్థులు జూలై 18 2023న స్కూల్ అసెంబ్లీ వార్తల (School Assembly News Headlines for 18 July 2023) ముఖ్యాంశాలను ఇక్కడ తెలుసుకోండి.
జూలై 18, 2023 స్కూల్ అసెంబ్లీ న్యూస్ హెడ్లైన్స్ (School Assembly News Headlines for 18 July 2023)
ఆంధ్రప్రదేశ్ వార్తలు (Andhra Pradesh News)
- శ్రీకాళహస్తి సీఐ అంజుయాదవ్పై తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫిర్యాదు చేశారు. అంజుయాదవ్పై చర్యలు తీసుకోవాలని కోరారు.
- పార్టీ ఎంపీలతో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. 20వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన దిశనిర్దేశం చేశారు.
- ఆర్ 5 జోన్ అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. తర్వాత విచారణను 21వ తేదీకి వాయిదా వేసింది.
- తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా జూలై 18న విడుదల చేయనున్నట్టు టీటీడీ వెల్లడించింది. భక్తులకు సౌకర్యంగా ఉండేలా షెడ్యూల్ను విడుదల చేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది.
తెలంగాణ వార్తలు (Telagana News)
- టీఎస్ఆర్టీసీ కొత్తగా పల్లె వెలుగు బస్సుల్లో బస్పాస్లను జారీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది.
- తొలుత కరీంనగర్, మహబూబ నగర్, నిజామాబాద్ నల్గొండ జిల్లా కేంద్రాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సులో ఈ పాస్ను అమలు చేయనుంది.
- హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డులో ప్రమాదం జరిగింది. శామీర్పేట, ఈ యాక్టిడెంట్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
- హనుమకొండ జిల్లా బట్టుపల్లిలోని ఎస్ఆర్ ప్రైమ్ జూనియర్ కాలేజీలో కలుషితాహారం తిని 40 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు వాంతులు, విరోచనాలు అయ్యాయి.
జాతీయ వార్తలు (National News)
- చంద్రయాన్-3 ప్రయోగం తర్వాత ఇస్రో PSLV మిషన్కు సిద్ధమైంది.
- బెంగళూరులో జరిగే విపక్షాల సభకు తాము హాజరవుతామని ఆమ్ ఆద్మీ పార్టీ వెల్లడించింది.
- లా ప్యానెల్ గడువును పొడిగించినప్పటికీ యూనిఫాం సివిల్ కోడ్ గురించి చర్చించడానికి కాంగ్రెస్ ఒక ప్రైవేట్ సమావేశాన్ని నిర్వహిస్తుంది.
- బీజేపీ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి రాజవంశాలను కాపాడుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది.
- VVPAT, EVM ఓట్ల గణనల క్రాస్ వెరిఫికేషన్ను అభ్యర్థిస్తూ సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ దాఖలైంది.
అంతర్జాతీయ వార్తలు (International News)
- ప్రముఖ బ్రిటిష్-ఫ్రెంచ్ ఫ్యాషన్ ఐకాన్ అయిన జేన్ బిర్కిన్ 76 ఏళ్ల వయసులో కన్నుమూశారు.
- యూరోపియన్ యూనియన్, ట్యునీషియా మధ్య ఇమ్మిగ్రేషన్తో పాటు ఆర్థిక మరియు వాణిజ్య సంబంధాలను ఏర్పాటు చేయడంలో పురోగతి సాధించబడింది.
- టైఫూన్ తాలీమ్ సమీపిస్తున్నందున హాంగ్ కాంగ్ దాని పాఠశాలలు, స్టాక్ ఎక్స్ఛేంజ్లను క్లోజ్ చేసింది.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్పై క్లిక్ చేసి చూడొచ్చు.