School Assembly News Headlines for 5 July 2023: ఏపీ, తెలంగాణ, జాతీయ వార్తలు ఇక్కడ తెలుసుకోండి
స్కూల్ అసెంబ్లీ వార్తల ముఖ్యాంశాల కోసం ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ వార్తలను (School Assembly News Headlines for 5 July 2023) ఇక్కడ అందజేయడం జరిగింది.
జూలై 05 స్కూల్ అసెంబ్లీ వార్తల ముఖ్యాంశాలు (School Assembly News Headlines for 5 July 2023) ఇక్కడ ఉన్నాయి. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం అన్ని తాజా అప్డేట్లను ఇక్కడ తెలుసుకోండి.
05 జూలై 2023 కోసం స్కూల్ అసెంబ్లీ వార్తల ముఖ్యాంశాలు (School Assembly News Headlines for 5 July 2023)
ఆంధ్రప్రదేశ్ వార్తలు (Andhra Pradesh News)
- బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరి నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆ స్థానంలో సోము వీర్రాజు కొనసాగారు. అధ్యక్షుడిగా ఆయన పదవీకాలం ముగియడంతో ఆయన తప్పుకున్నారు.
- చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ పనులకు సీఎం జగన్ భూమి పూజ చేశారు. ఆమూల్ ఆధ్వర్యంలో ఈ పనులు సాగుతున్నాయి. ఈ సందర్భంగా చిత్తూరు డెయిరీకి జీవం పోస్తున్నామని జగన్ అన్నారు.
తెలంగాణ న్యూస్ (Telangana News)
- జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా కిషన్ రెడ్డిని నియమించారు. అదేవిధంగా తెలంగాణలో ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా ఈటెల రాజేందదర్ బాధ్యతలు చేపట్టారు.
- తెలంగాణలో నలుగురు ఐఏఎస్లకు బదిలీ అయింది. ప్రభుత్వం జీహెచ్ఎంసీ కమిషనర్గా రొనాల్డ్ రోస్ను నియమించింది.
- సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సీఎం కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీకి మేలు చేసేందుకే అఖిలేస్ యాదవ్ను కేసీఆర్ హైదరాబాద్ రప్పించుకున్నారని అన్నారు. టీఆర్ఎస్ బీజేపీ బీ టీమ్గా పనిచేస్తోందన్నారు.
జాతీయ, అంతర్జాతీయ వార్తలు (National, Inter National News)
- జూలై 4న ఏర్పాటు చేసిన వర్చువల్ SCO సమ్మిట్ 2023లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదంపై పోరాడాలని, ఆఫ్ఘనిస్తాన్కు సహాయం చేయాలని ఇతర దేశాలను కోరారు.
- మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అజిత్ పవార్ జూలై 4న ముంబైలో కొత్త ఎన్సీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
- ఒడిశా రైలు ప్రమాదంలో CRS దర్యాప్తులో పెద్ద లోపాలు కనుగొనబడ్డాయి.
- భారత వాతావరణ శాఖ ఇచ్చిన భారీ వర్షాల హెచ్చరిక కారణంగా దక్షిణ, కన్నడలో పాఠశాలలకు సెలవు ప్రకటించడం జరిగింది.
- ఆఫ్ఘనిస్తాన్లో మహిళలపై అణచివేత కొనసాగుతూనే ఉంది. తాజాగా తాలిబాన్లు విధించిన నిబంధనల ప్రకారం దేశంలో ఏ బ్యూటీ సెలూన్లను మహిళలు నిర్వహించకూడదు.
- ఖలిస్తానీ రాడికల్స్ శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్కు నిప్పు పెట్టారు.ఇప్పటి వరకు జరిగిన హింసను అమెరికా ఖండించింది.