School Assembly News Headlines for 6 July 2023: ఏపీ, తెలంగాణ, జాతీయ వార్తలు ఇక్కడ తెలుసుకోండి
జూలై 06 స్కూల్ అసెంబ్లీ వార్తల ముఖ్యాంశాలు (School Assembly News Headlines for 6 July 2023) ఇక్కడ ఉన్నాయి. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం అన్ని తాజా అప్డేట్లను ఇక్కడ తెలుసుకోండి.
జూలై 06 స్కూల్ అసెంబ్లీ వార్తల ముఖ్యాంశాలు (School Assembly News Headlines for 6 July 2023) ఇక్కడ ఉన్నాయి. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం అన్ని తాజా అప్డేట్లను ఇక్కడ తెలుసుకోండి.
06 జూలై 2023 కోసం స్కూల్ అసెంబ్లీ వార్తల ముఖ్యాంశాలు (School Assembly News Headlines for 6 July 2023)
ఆంధ్రప్రదేశ్ వార్తలు (Andhra Pradesh News)
- ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలోని ఆర్ 5 జోన్లో పేదల ఇళ్ల నిర్మాణాల అంశంపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా అక్కడ ఇళ్ల నిర్మాణాలకు సుప్రీకోర్టు అనుమతి ఇచ్చిందా? అని హైకోర్టు ప్రశ్నించింది.
- మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తనను బాధితుడుగా చూడాలంటూ ఆయన పీఏ కృష్ణారెడ్డి వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
- విజయవాడలోని హోటల్ ఐలాపురం దగ్గర ఆందోళన జరిగింది. సోషల్ మీడియా - మహిళలపై దాడి అనే అంశంపై జరుగుతున్న సెమినార్కు టీడీపీ, జనసేప పార్టీ మహిళా నేతలను పోలీసులు అనుమతించలేదు.
తెలంగాణ వార్తలు (Telangana News)
- తెలంగాణ హైకోర్టులో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పిల్పై విచారణ జరిగింది. ఆర్టీఐ కమిషనర్ల నియామకంలో జరుగుతున్న జాప్యంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
- తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా తనను నియమించడంపై ఆ పార్టీ నాయకుడు కిషన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. తన నిర్వర్తించిన బాధ్యతలను పార్టీ గుర్తించిందని ఆయన అన్నారు.
- తెలంగాణ రాష్ట్రంలో చాలా వేగంగా అభివృద్ధి జరుగుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లో త్వరలోనే 1000 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభిస్తామని ఆయన అన్నారు.
జాతీయ వార్తలు (National News
- గిరిజన యువకుడిపై మూత్ర విసర్జన చేశాడని ఆరోపించిన మధ్యప్రదేశ్ వ్యక్తిపై బుల్డోజర్ చర్య తీసుకోవాలని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి డిమాండ్ చేశారు.
- ఆర్థిక వ్యవస్థ, ధరల పెరుగుదలపై కాంగ్రెస్ నేత ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
- భారతదేశంలో కొత్తగా కోవిడ్ 56 కేసులు గుర్తించబడ్డాయి.
- మణిపూర్లో అల్లర్లు చెలరేగుతూనే ఉన్నాయి. అల్లరి మూకలు ఆయుధాలు లూటీ చేయడానికి ప్రయత్నించడంతో మరోసారి అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
- ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు ప్రాంగణంలో తుపాకీ కాల్పులు జరిగాయి. రెండు వర్గాలకు చెందిన లాయర్లు గొడవపడ్డారు. ఆ సందర్భంగా గాల్లోకి కాల్పులు జరిపినట్టు పోలీసులు వెల్లడించారు.