![AP EDCET Counselling 2023: ఏపీ ఎడ్సెట్ కౌన్సెలింగ్ 2023 ప్రక్రియ ప్రారంభం, పూర్తి షెడ్యూల్ ఇక్కడ చూడండి](https://media.collegedekho.com/media/img/news/AP_EDCET_Counselling_2023.png?height=310&width=615)
ఏపీ ఎడ్సెట్ కౌన్సెలింగ్ 2023 (AP EdCET Counselling 2023) : ఏపీ ఎడ్సెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఈరోజు అంటే జనవరి 31న ప్రారంభమైంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 31 నుంచి ఫిబ్రవరి 17 వరకు కౌన్సెలింగ్ జరుగుతుంది. ఎడ్సెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 6 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం నమోదు చేసుకోవడానికి జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.1200 ఫీజు చెల్లించాలి. షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), వికలాంగులు (PwD) కేటగిరీల అభ్యర్థులు రూ.700 మాత్రమే చెల్లించాలి.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసిన అభ్యర్థులకు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుంది. అయితే స్పెషల్ కేటగిరీ అభ్యర్థులకు ఫిబ్రవరి 5న హెచ్ఎల్సీ, ఆంధ్రా లయోలా కాలేజీ, వెటర్నరీ కాలనీ, విజయవాడలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫిజికల్గా నిర్వహిస్తారు.
ఏపీ ఎడ్సెట్ 2023 కౌన్సెలింగ్ ముఖ్యమైన తేదీలు (AP EdCET 2023 Counselling: Important Dates)
ఏపీ ఎడ్సెట్ 2023 కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనే అభ్యర్థులు ఈ దిగువ పట్టిక నుంచి అన్ని ముఖ్యమైన తేదీలను చెక్ చేయాలి.ఈవెంట్ | ముఖ్యమైన తేదీలు |
---|---|
రిజిస్ట్రేషన్ | జనవరి 31 నుంచి ఫిబ్రవరి 6, 2024 |
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ | ఫిబ్రవరి 2 నుంచి 7, 2024 |
ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ భౌతికంగా చేయబడుతుంది | ఫిబ్రవరి 05, 2024 |
ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్లు | ఫిబ్రవరి 09 నుంచి 13, 2024 |
వెబ్ ఆప్షన్ల మార్పు | ఫిబ్రవరి 14, 2024 |
మొదటి దశ కౌన్సెలింగ్కు సీట్ల కేటాయింపు | ఫిబ్రవరి 17, 2024 |
మొదటి దశ కౌన్సెలింగ్ తర్వాత కాలేజీల్లో రిపోర్టింగ్ | ఫిబ్రవరి 19, 2024 |
తరగతులు ప్రారంభం | ఫిబ్రవరి 19, 2024 |
ఏపీ ఎడ్సెట్ 2023 కౌన్యసెలింగ్ అర్హత ప్రమాణాలు (AP EdCET 2023 Counselling: Eligibility criteria)
ఏపీ ఎడ్సెట్ కౌన్సెలింగ్ రౌండ్ కోసం అర్హత ప్రమాణాలు క్రింది విధంగా ఉన్నాయి.- అభ్యర్థి తప్పనిసరిగా భారతీయుడై ఉండాలి.
- అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థ ప్రకారం లోకల్, నాన్ లోకల్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి.
- అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీలో అంటే, BA, BSc, BCom, BCA, BBM లేదా సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో కనీసం 50% మార్కులు సాధించి ఉండాలి.
- గణితం, భౌతిక శాస్త్రంలో కనీసం 55% మార్కులతో బీఈ, బీటెక్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు కోర్సులో ప్రవేశానికి అర్హులు.
- అభ్యర్థులు నోటిఫికేషన్ జారీ చేసిన సంవత్సరం జూలై 1 నాటికి 19 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి ఉండదు.
- రిజర్వ్డ్ కేటగిరీలు అంటే SC, ST, OBC-A, OBC-B, OBC-C, OBC-D, OBC-E అభ్యర్థులు కూడా అర్హులు.
- శారీరక వికలాంగ అభ్యర్థులు చివరి అర్హత పరీక్షలో కనీసం 40% మార్కులను కలిగి ఉండాలి.