![School Assembly News Headlines for 1 July 2023: ఏపీ, తెలంగాణ, జాతీయ వార్తలు కోసం ఇక్కడ చూడండి](https://media.collegedekho.com/media/img/news/School_Assembly_News_Headlines_for_1_July_2023.png?height=310&width=615)
జూలై 01, 2023 స్కూల్ అసెంబ్లీ వార్తల ముఖ్యాంశాలు (School Assembly News Headlines for 1 July 2023) ఇక్కడ ఉన్నాయి. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం అన్ని తాజా అప్డేట్లను ఇక్కడ తెలుసుకోండి.
జూలై 01, 2023 కోసం స్కూల్ అసెంబ్లీ వార్తల ముఖ్యాంశాలు (School Assembly News Headlines for 1 July 2023)
ఆంధ్రప్రదేశ్ వార్తలు (Andhra Pradesh News)
- ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో అగ్నిప్రమాదం సంభవించింది. సెజ్లోని సాహితీ ఫార్మాలో బాలు పేలుడు జరిగి మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి.
- ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఘాటుగా విమర్శించారు. వైఎస్ జగన్ ముందు బకాసురుడు కూడా తక్కువేనన్నారు.
- గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం దగ్గర ఓ మహిళా పోలీసు నిరసన వ్యక్తం చేశారు. లక్ష్మీ ప్రసన్న అనే మహిళా పోలీసులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. వైసీపీ నేతలు తనను వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు.
తెలంగాణ వార్తలు (Telangana News)
- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోడు పట్టాలన్నింటిని మహిళల పేరు మీదే అందించినట్టు కేసీఆర్ చెప్పారు.
- ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ అన్నారు.
- వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టులో విచారణ శుక్రవారం జరిగింది. వైఎస్ వివేకా హత్య కేసులో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ని సీబీఐ అధికారులు దాఖలు చేశారు.
- పీఎం నరేంద్ర మోదీ తాను సేవకుణ్ణి తప్ప ఓనరుని కాదంటారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం తామే చేస్తున్నామని చెబుతారని ఎద్దేవ చేశారు.
జాతీయ వార్తలు (National News)
- ఢిల్లీ యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాల వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం హాజరై యూనివర్సిటీకి చెందిన మూడు భవనాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మెట్రో ప్రయాణించారు. సాధారణ ప్రజలతో మాట్లాడారు.
- మణిపూర్లో పర్యటిస్తోన్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అక్కడి పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను కలసి మాట్లాడిన రాహుల్ గాంధీ వారికి ఎదురైన కష్టం తన గుండెను కలిచివేసిందన్నారు.
- మణిపూర్లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పర్యటనపై అసోం సీఎం హిమంత బిశ్వశర్మ విమర్శలు చేశారు. ప్రచారం కోసమే రాహుల్ గాంధీ ఇలా చేస్తున్నారని అన్నారు.
- మహారాష్ట్రలోని పూణేలో కాంగ్రెస్ నేత రామకృష్ణ మోరెపై విడుదల చేసి పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పై ప్రసంశలు కురిపించారు.