![School Assembly News Headlines for 13 July 2023: ఏపీ, తెలంగాణ, జాతీయ వార్తల కోసం ఇక్కడ చూడండి](https://media.collegedekho.com/media/img/news/School_Assembly__News_.png?height=310&width=615)
జూలై 13 స్కూల్ అసెంబ్లీ వార్తల ముఖ్యాంశాలు (School Assembly News Headlines for 13 July 2023) ఇక్కడ ఉన్నాయి. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం అన్ని తాజా అప్డేట్లను ఇక్కడ తెలుసుకోండి.
13 జూలై 2023 కోసం స్కూల్ అసెంబ్లీ వార్తల ముఖ్యాంశాలు (School Assembly News Headlines for 13 Juay 2023)
ఆంధ్రప్రదేశ్ వార్తలు (Andhra Pradesh News)
స్కూల్ అసెంబ్లీ కోసం ఆంధ్రప్రదేశ్ వార్తలు ఈ దిగువున అందజేయడం జరిగింది.- రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో కేబినెట్ భేటీ జరిగింది. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో వివిధ ప్రాజెక్టులకు కేబినెట్ అంగీకారం తెలిపింది. సీఆర్డీఏ పరిధిలోని ఆర్5 జోన్లో 47 వేల ఇళ్ల నిర్మాణాలకు ఆమోదం తెలిపింది.
- తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ కార్యకర్తలు ఆందోళన దిగారు. జనసేన నాయకులు పవన్ కల్యాణ్పై సీఎం జగన్ చేసిన కామెంట్లకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జనసేన నేతలపై మహిళా సీఐచేయించుకున్నారు.
- ఫీజులు విషయంలో ఏపీలో ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల యాజమాన్యాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఫీజు నియంత్రణ విధానంలో నిబంధనలు పాటించడం లేదని పేర్కొన్నాయి.
- జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నాయకుడు చంద్రబాబు స్పందించారు. వాలంటీర్లు పౌరసేవకే పరిమితం అవ్వాలని, వ్యక్తిగత సమాచారం సేకరించడం ద్రోహం అవుతుందని అన్నారు.
తెలంగాణ వార్తలు (Telangana News)
స్కూల్ అసెంబ్లీ కోసం తెలంగాణ వార్తలు ఈ దిగువున తెలుసుకోండి.- తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆవర్తనం ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి.
- పాలన విధానాలపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తెలంగాణలో రైతులకు పేరుకే 24 గంటల విద్యుత్ ఇస్తున్నారని, గంటసేపు కరెక్ట్గా ఇవ్వడం లేదని ఆరోపించారు.
- కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో రైతు విధానాలు అమలు అవుతున్నాయని వాటిని చూసి ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆక్షేపించారు. రైతు బంధు పథకం దేశంలో మరెక్కడా లేదన్నారు.
జాతీయ వార్తలు (National News)
స్కూల్ అసెంబ్లీ కోసం జాతీయ వార్తలు ఈ దిగువున అందజేయడం జరిగింది.- బెంగళూరులో విపక్షాల సమావేశానికి 24 పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని ఆహ్వానించారు.
- కట్టుదిట్టమైన భద్రత మధ్య 7,800 మంది యాత్రికులతో కూడిన 10వ బ్యాచ్ జమ్మూ నుంచి అమర్నాథ్కు బయలుదేరింది.
- సైబర్ క్రైమ్తో ప్రపంచవ్యాప్తంగా ప్రజల భద్రతకు ముప్పు పొంచి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు.
- బాలాసోర్ ట్రిపుల్ రైలు ఘటనలో సీబీఐ అదుపులోకి తీసుకున్న ముగ్గురితో సహా ఇప్పటి వరకు ఏడుగురిని రైల్వే శాఖ సస్పెండ్ చేసింది. 24 గంటల పాటు అరెస్టు చేసిన ఉద్యోగిని నిబంధనల ప్రకారం సస్పెండ్ చేస్తామని సౌత్ ఈస్ట్రన్ రైల్వే జీఎం అనిల్ కుమార్ మిశ్రా తెలిపారు.
- గిరిజన సభ్యులు పర్యవేక్షక బృందాల్లో భాగం కావాలని మణిపూర్ సుప్రీంకోర్టు ఆదేశించింది.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్పై క్లిక్ చేయండి.