![School Assembly News Headlines for 14 July 2023: ఏపీ, తెలంగాణ, జాతీయ వార్తల కోసం ఇక్కడ చూడండి](https://media.collegedekho.com/media/img/news/School_Assembly_News_July_14.png?height=310&width=615)
జూలై 14 స్కూల్ అసెంబ్లీ వార్తల ముఖ్యాంశాలు (School Assembly News Headlines for 14 July 2023) ఇక్కడ ఉన్నాయి. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం అన్ని తాజా అప్డేట్లను ఇక్కడ తెలుసుకోండి.
14 జూలై 2023 కోసం స్కూల్ అసెంబ్లీ వార్తల ముఖ్యాంశాలు (School Assembly News Headlines for 14 Juay 2023)
ఆంధ్రప్రదేశ్ వార్తలు (Andhra Pradesh News)
- తెలంగాణ విద్యా వ్యవస్థపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ విద్యా విధానాన్ని ఆఫ్ట్రాల్ తెలంగాణతో పోల్చ చూడడం సరికాదన్నారు.
- రాష్ట్రంలో పేదల బతుకులు మార్చాలనే రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వ్యవస్థలోని లోపాలను సరిదిద్దేందుకే పోరాడుతున్నానని అన్నారు.
- రాష్ట్రంలో నంద్యాల జిల్లాలోన డోన్ హైవేపై భారీ దోపిడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ కారును అడ్డగించి రూ.4 కోట్ల నగదును దోచుకెళ్లారు.
- శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత డాక్టర్ బొప్పన సత్యనారాయణ రావు (75) గురువారం అనారోగ్యంతో కన్నుమూశారు.
తెలంగాణ వార్తలు (Telangana News)
- విద్యుత్ విషయంలో చేసిన వ్యాఖ్యలకు పీసీసీ నేత రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని కోరుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు.
- బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 24 గంటలు విద్యుత్ ఇచ్చినట్టు రుజువు చేస్తే తాను రాజీనామా చేయడానికి సిద్ధమని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంటక్ రెడ్డి సవాల్ చేశారు.
- హైదరాబాద్లోని గోకుల్ చాట్, లుంబినీ పార్కు పేలుళ్ల కేసుల్లో నిందితులకు శిక్ష విధిస్తూ ఎన్ఐఏ కోర్టు తీర్పు ఇచ్చింది. ఇండియన్ ముజాహిద్దున్కు చెందిన నలుగురు టెర్రరిస్టులకు పదేళ్ల జైలు శిక్ష విధించింది. వీరు దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్రలు చేసినట్లు ఎన్ఐఏ వెల్లడించింది.
జాతీయ వార్తలు (National News)
- దేశంలో వైజ్ఞానిక పరిశోధనలను హతమార్చేందుకు బీజేపీ ప్రభుత్వం నడుం బిగించిందని కాంగ్రెస్ ఆరోపించింది.
- దేశంలో భద్రత సవాళ్లు పెరిగాయని, 'డైనమైట్ నుంచి మెటావర్స్', 'హవాలా నుంచి క్రిప్టో కరెన్సీకి' మారాయని హోంమంత్రి అమిత్ షా అన్నారు.
- శ్రీహరికోట నుంచి చంద్రయాన్-3 ప్రయోగానికి కౌంట్డౌన్ జూలై 13 మధ్యాహ్నం ప్రారంభమైంది.
- ఢిల్లీలో యమునా నీటిమట్టం పెరుగుతూనే ఉందని, ఇది ‘ఎమర్జెన్సీ’ పరిస్థితి అని సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు.
- మనుషులు, వీధి కుక్కల మధ్య వివాదాలకు మానవీయ పరిష్కారం కోసం సుప్రీంకోర్టు ప్రయత్నించాలి.
- పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ త్వరలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.