![School Assembly News Headlines for 4 July 2023: ఏపీ, తెలంగాణ, జాతీయ వార్తలు ఇక్కడ తెలుసుకోండి](https://media.collegedekho.com/media/img/news/School_Assembly_News_Headlines_for_4_July_2023.png?height=310&width=615)
జూలై 04 స్కూల్ అసెంబ్లీ వార్తల ముఖ్యాంశాలు (School Assembly News Headlines for 4 July 2023) ఇక్కడ ఉన్నాయి. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం అన్ని తాజా అప్డేట్లను ఇక్కడ తెలుసుకోండి.
04 జూలై 2023 కోసం స్కూల్ అసెంబ్లీ వార్తల ముఖ్యాంశాలు (School Assembly News Headlines for 4 Juay 2023)
ఆంధ్రప్రదేశ్ వార్తలు (Andhra Pradesh News)
- ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోమవారం 145 కొత్త అంబులెన్స్లను ప్రారంభించారు. దీంతో రాష్ట్రంలో అంబులెన్సుల సంఖ్య 768కి చేరుకుంది.
- టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, కేంద్ర విదేశీ వ్యవహరాల శాఖ మంత్రి జైశంకర్కు ఓ లేఖ రాశారు. అమెరికాలోని ఫ్లోరిడాలో చనిపోయిన అద్దంకికి చెందిన రాజేశ్ కుమార్ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు సాయం చేయాలని ఆ లేఖలో కోరారు.
- ఆంధ్రప్రదేశ్లో సర్పంచ్లు తలపెట్టిన పంచాయతీ రాజ్ కమిషనర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం సోమవారం ఉద్రిక్తతంగా సాగింది. ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తాడేపల్లిలో ఈ కార్యక్రమం జరిగింది.
- ఆంధ్రప్రదేశ్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండడంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
తెలంగాణ వార్తలు (Telangana News)
- దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు బండి సంజయ్ మార్పుపై వస్తున్న వార్తలన్నీ నిజమేనని స్పష్టం చేశారు. పదేళ్ల నుంచి పార్టీకి సేవలందిస్తున్నా తాను అధ్యక్ష పదవికి అర్హుడిని కాదా? అని ప్రశ్నించారు.
- కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఖమ్మంలో చేసిన ప్రసంగంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా తమ పార్టీ బీజేపీకి బీ టీమ్ కాదు, కాంగ్రెస్కు సీ టీమ్ అంతకన్నా కాదని, ఆ రెండు పార్టీలను ఒంటిచేత్తో ఢీ కొట్టే ఢీ టీమ్ అని ట్వీట్ చేశారు.
- తొమ్మిదో విడతల హరితహారం కార్యక్రమానికి హన్మకొండ జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తుంది. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా 208 గ్రామ పంచాయతీల్లో నర్సరీలను ఏర్పాటు చేశారు.
- క్రీస్తు శకం 13వ శతాబ్దానికి చెందిన మరకమ్మ విగ్రహాన్ని సిద్దిపేట గ్రామంలో గుర్తించారు. సిద్దిపేటలోని వెల్కటూరు గ్రామంలో మరకమ్మ అరుదైన శిల్పాన్ని గుర్తించినట్టు కేటీసీబీ సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ తెలిపారు.
జాతీయ వార్తలు (National News)
- మణిపూర్లోని నెలకొన్న పరిస్థితిపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అక్కడ జాతుల మధ్య నెలకొన్న ఘర్షణలను నివారించేందుకు తీసుకుంటున్న చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
- ISRO సెమీ క్రయోజెనిక్ ఇంజన్ హాట్ టెస్ట్ను మధ్యలోనే నిలిపివేసింది. భవిష్యత్ ప్రయోగ వాహనాల బూస్టర్ దశలను శక్తివంతం చేయడానికి 2000 kN (కిలో న్యూటన్) థ్రస్ట్ సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ను అభివృద్ధి చేయడానికి ఈ పరీక్ష నిర్వహించబడింది.
- 2000 రూపాయల నోట్ల రద్దుపై ఆర్బీఐ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఎలాంటి గుర్తింపు రుజువు లేకుండా రూ.2000 కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు అనుమతి ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను అదే ధర్మాసనం ఇటీవల తోసిపుచ్చింది.
- ఢిల్లీలో టోమోటో ధర కేజీ 140 రూపాయలకి చేరింది. కీలకమైన ఉత్పత్తి కేంద్రాల నుంచి టమాటా సప్లై అంతంత మాత్రంగానే ఉండడంతో ధరలు పెరిగాయి. వర్షాల కారణంగా టోమాటో సరఫరాకు అంతరాయం ఏర్పడింది.