జూలై 07 స్కూల్ అసెంబ్లీ వార్తల ముఖ్యాంశాలు (School Assembly News Headlines for 7 July 2023) ఇక్కడ ఉన్నాయి. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం అన్ని తాజా అప్డేట్లను ఇక్కడ తెలుసుకోండి.
07 జూలై 2023 కోసం స్కూల్ అసెంబ్లీ వార్తల ముఖ్యాంశాలు (School Assembly News Headlines for 7 Juay 2023)
ఆంధ్రప్రదేశ్ వార్తలు (Andhra Pradesh News)
- ఏపీ, తెలంగాణ రాష్ట్రాల హైకోర్టులకు సీజేల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఏపీకి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, తెలంగాణాకు జస్టిస్ అకోక్ అరదేను సుప్రీంకోర్టు సిఫార్సు చేసింది.
- తిరుమలలో ఎమ్మెల్సీ సిఫార్సు లేఖపై బ్రేక్ దర్శన టికెట్లను ఎక్కువ ధరలకు అంటే రూ.36 వేలకు విక్రయించారు. దీంతో తితిదే ఉద్యోగిని విజిలెన్స్ అధికారులు అందుపులోకి తీసుకున్నారు.
- గృహ నిర్మాణ శాఖపై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలో ఇళ్ల నిర్మాణం అనుకున్న సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు. డిసెంబర్లోగా ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలని సూచించారు.
- బీజేపీ జాతీయ అధ్యక్షుడైన జేపీ నడ్డాను ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షురాలు పురందేశ్వరి కలిశారు. తనను ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించినందుకు మర్యాదపూర్వకంగా ఆయన్ని కలిసినట్టు ఆమె ట్వీట్ చేశారు.
తెలంగాణ వార్తలు (Telangana News)
- తెలంగాణ రాష్ట్రంలో 14,565 ఇంజనీరింగ్ సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇంజనీరింగ్ కాలేజీలు కోర్ గ్రూపుల్లో సీట్లు వెనక్కి ఇస్తామని చెప్పి ఇంజనీరింగ్ కాలేజీలు కంప్యూటర్ కోర్సుల్లో సీట్లకు అనుమతి కోరాయి.
- కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ధరణి పేరుతో కేసీఆర్ కుటుంబం ప్రజలను మోసం చేస్తుందని, రాత్రిపూట ధరణి రిజిస్ట్రేషన్లను జరుగుతున్నాయని విమర్శించారు.
- నిర్మల్ జిల్లాలోని మామాడ, సారంగాపూర్ మండల కేంద్రాల్లో లబ్దిదారులకు పోడు పట్టాలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొమురం భీం కలలను సీఎం కేసీఆర్ సాకారం చేశారని అన్నారు.
జాతీయ వార్తలు (National News)
- మణిపూర్లోని కాంగ్పోక్పి జిల్లాలో చెలరేగిన ఘర్షలను భద్రతా బలగాలు అదుపు చేశాయి.
- కేరళలో భారీవర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారత వాతావరణ శాఖ రాష్ట్రంలోని చాలా ప్రాంతాలకు ఎల్లో, ఆరేంజ్ హెచ్చరికలను జారీ చేసింది. గోవాలో రెడ్ అలర్ట్ ప్రకటించింది.
- భారతదేశంలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 1,452 క్రియాశీల కోవిడ్ కేసులు రిజిస్టర్ అయ్యాయి.
- జమ్మూకశ్మీర్లో జాతీయ గీతాన్ని అవమానించినందుకు 14 మందిని అదుపులోకి తీసుకున్నారు.
- మూత్ర విసర్జన ఘటనలో మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్ స్పందించారు. బాధితుడి కాళ్లు కడిగి, క్షమాపణలు కోరారు.